(జనం న్యూస్ చంటి)
దౌల్తాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్లో 26-09-2025న అధ్యాపకులు, తల్లిదండ్రుల సమావేశం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రగతి, అకాడమిక్ పురోగతి పై వ్యక్తిగతంగా వివరించారు.ఇటీవలి కాలంలో కళాశాలలో జరుగుతున్న సంస్కరణలు, హెల్ప్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సహజ సామర్థ్యాన్ని గుర్తించి, సరైన దిశలో మలచడానికి ధ్యానం, యోగా తరగతులు క్రమంగా నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. అలాగే ప్రతి శనివారం ఆటల పోటీల ద్వారా విద్యార్థుల శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతున్నట్టు తెలిపారు.తల్లిదండ్రుల సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుంటామని, విద్యార్థుల హాజరు, అభివృద్ధి పట్ల పూర్తి అంకితభావంతో కట్టుబడి ఉన్నామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ మధు శ్రీ వాత్సవ సమావేశంలో పేర్కొన్నారు.మధ్యాహ్నం తర్వాత బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాజు, లక్ష్మినారాయణ, సుధాకర్, మంగతానాయక్, శివకుమార్ సంపత్, దయానంద్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి భాగ్యమ్మ, శ్రీనివాస్, శ్రీమతి రమ్య తదితరులు పాల్గొన్నారు


