Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని గోవిందా పురం గ్రామ లో భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ జిల్లా మాజీ జెడ్పిచైర్ పర్సన్& బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారం.బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి *కాంగ్రెస్ బాకీ కార్డు ప్రజలకు ఇస్తూ, వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.రైతులకి ఇస్తామని చెప్పిన రైతుబంధు ఇవ్వలేదు, రైతు ఋణమాఫీ చేయలేదు,
మహిళలకు ఇస్తామన్నా రూ. 2500/- ఇవ్వలేదు, వృద్దులకు, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్స్ పెంచనులేదు, కళ్యాణలక్ష్మీ లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టిండు ఇవ్వలేదు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయ్యండి అంటూ వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదిగో మా బాకీ కార్డు, మాకు రావాల్సిన బాకీ ఇవ్వండి అంటూ అడగాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు నర్ర రాజు, మండల సోషల్ మీడియా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు సౌల్ల కిష్టయ్య, గ్రామ సోషల్ మీడియా కన్వీనర్ ఆకుల లక్ష్మణ్, గ్రామశాఖ ఉపాధ్యక్షులు బైరి రాజకుమార్, ప్రధాన కార్యదర్శి బూర సత్యనారాయణ, నాయకులు నర్ర వెంకటేష్ ,కార్యకర్తలు పాల్గొన్నారు…