Listen to this article

జనం న్యూస్, అక్టోబర్ 8, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన దబ్బెట ఆనంద్ డేవిడ్ భానుప్రసాధ్ ఆంజనేయులు శ్రీనివాస్ లను
బహుజన లెఫ్ట్ పార్టీ- బి ఎల్ పి లో కి ఆహ్వానించినట్లు గా బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్,ఈరోజు సిద్ది పేట్ ప్రెస్ మీట్ లో తెలిపారు.ఈరోజు హైదరాబాద్ నల్లకుంట లోగల రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించన అనంతరం ఆయన మాట్లాడుతూ
మార్క్సిజం- అంబేడ్కరిజం ఆలోచన విధానంతో కూడిన రాజకియ కార్యక్రమం ద్వారా తెలంగాణలో బహుజన శ్రామిక ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ రాజ్యాధికారం లక్ష్యంగా పని చేస్తున్న బహుజన లెఫ్ట్ పార్టీ- బి ఎల్ పి (బహుజన కమ్యూనిస్టు)లోకి సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన దబ్బెట ఆనంద్, డేవిడ్,భానుప్రసాధ్, ఆంజనేయులు శ్రీనివాస్ లు బహుజన వామపక్ష ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవం ఉన్న దృష్ట్యా
బహుజన లెఫ్ట్ పార్టీలోకి ఆహ్వానించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలిపారు.
సిద్దిపేట్ జిల్లాలో పార్టీ,ప్రజా సంఘాల బలోపేతానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి వడ్ల సాయి కృష్ణ, రాష్ట్ర కమిటి సభ్యులు వై. అనిల్ కుమార్ లు పాల్గొన్నారు.