Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని పశుసంపదలో అగ్రస్థానం నిలిచిన నూర్జహాన్ పల్లి గ్రామంలో ఉన్నటువంటి పశువులకు స్థానిక పశువైద్యాధికారి సునిల్ ప్రజ్వాల్ సంస్థ సంయుక్తంగా గ్రామంలోని 150 తెల్లజాతి పశువులకు 40 నల్ల జాతి పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు వేశారు. ఈ సందర్భంగా ప్రజ్వాల్ సంస్థ గ్రామ కార్యకర్త తరాల తిరుపతి మాట్లాడుతూ మూగజీవాలు వాటి బాధలను చెప్పలేవని ముందుగానే రైతులు నివారణకు టీకాలు వేయించి మూగజీవాలను రక్షించు కోవాలని రైతులు ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది రవి రమేష్ బాబు, సదానందం, నవయుగ సొసైటి డైరెక్టర్ అల్లే రాజీరు, శ్రీపతి రామకోటి, చెల్పూరి రామచంద్ర , కుమారస్వామి , అనిల్, గోపాల్, రాజు తదితరులు పాల్గొన్నారు….