తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 06
పి రాములు నేత జాగో తెలంగాణ వ్యవస్థాపకులు
సంగారెడ్డి జిల్లా ప్రజలు రెవెన్యూ శాఖ అధికారుల పనితీరుతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ పబ్లిక్ ప్రజల చిన్నచిన్న పనులు నెలల తరబడి పెండింగ్లో ఉంచి ప్రజలను కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేస్తున్నారు. ప్రధానంగా సర్వే నంబర్ వివిధ భాగాలలో బై వన్ బై టు పెట్టి అనేకమంది పట్టేదారులు ఉన్నప్పటికీ సాధారణంగా సర్వేనెంబర్ బై వన్ పై కేసు పడితే మొత్తం సర్వే నంబర్ కి హోల్డ్ లో పెట్టడమే కాకుండా మొత్తం సర్వే నంబర్ పైన కేసు ఉందని అధికారులు తెలుపుతున్నారు బై సర్వే నంబర్ పైన కేసుంటే వివిధ పట్టేదారులది ఏం తప్పు ఈ చిన్న సమస్యను పరిష్కరించలేక పోతుంది రెవెన్యూ అధికారులు ప్రోహిబిటేడ్ ఉంది అని లక్షలు డిమాండ్ చేస్తున్నారు ఈ వ్యవస్థ పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవడమే కాకుండా ఇలాంటి సమస్యను వెంటనే పరిష్కరించాలి అని ఆదేశాలు ఇయ్యాలి,
సర్టిఫికెట్లు, ఆదాయ ధృవపత్రాలు, కులం సర్టిఫికెట్లు, మ్యూటేషన్ వంటి పనులు చేయించుకోవడానికి ప్రజలు అధికారులు వద్దకు పలుమార్లు వెళ్లినా సరైన స్పందన లేకుండా ఫైళ్ళు టేబుళ్లపై దుమ్ము పట్టేలా పెడుతున్నారు. పనులు పూర్తవ్వక ప్రజలు చెప్పులు అరిగిపోయేంతవరకు కార్యాలయాలు తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి రెవెన్యూ శాఖలో అవినీతి, ఆలస్యాలను ఆపేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



