జనం న్యూస్ నవంబర్ 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
84 వ వార్డు లక్ష్మీనారాయణ నగర్, గొల్ల వీధి, పిల్లా వారి వీధి లో నివాసం ఉంటున్న ప్రజలు అభ్యర్థన మేరకు కాలువలు రోడ్లు సరియైన కల్వర్టులు లేకపోవడం వల్ల రాత్రి సమయంలో ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల కాలంలో అపార్ట్మెంట్లు ఎక్కువ రావడంతో వాడుక నీరు వెళ్లే మార్గాలు లేక దోమల బెడద ఎక్కువగా ఉందని నా దృష్టికి తీసుకు రావడంతో శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పిలా గోవింద సత్యనారాయణ దృష్టికి తీసుకు రావడంతో జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రధాన కమిషనర్ కేతన్ గార్గే కోటి 70 లక్షలు నిధులు మంజూరు చేశారని కార్పొరేటర్ మాదంశెట్టి చిన్న తల్లి నీలబాబు తెలియజేశారు. నిధులు మంజూరు తో ఈరోజు ఉదయం లక్ష్మీనారాయణ నగర్ సిమెంట్ రోడ్లు కాలువలు కల్వర్టు కోటి రూపాయలు, గొల్ల వీధిలో సీసీ రోడ్లు కల్వర్టు 50 లక్షలు, పిల్లా వారి వీధిలో సిసి రోడ్డు కల్వర్ట్లకు 20 లక్షలు మంజూరు చేశారని కార్పొరేటర్ చిన్న తల్లి కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించామని 84 వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాదంశెట్టి నీలబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు తలారి ప్రసాదు టిడిపి పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి కోట్ని రామకృష్ణ సాలాపు మోహన్ కోట్ని రాంబాబు బత్తుల శ్రీను నమ్మి రామారావు జనసేన నాయకులు సిహెచ్ ప్రసాద్ మధ్య శ్రీను మడగల శ్రీను ఇంజనీరింగ్ అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


