Listen to this article

జనం న్యూస్ నవంబర్ 7 నడిగూడెం

గత మూడు నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన గ్రామ పంచాయతీ కార్మికుడు మొలుగూరి నరసింహారావు కుటుంబానికి తోటి కార్మికులు ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం మండలంలోని రత్నవరం గ్రామంలో మృతుని నివాసం వద్ద మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ కార్మికుల ద్వారా సేకరించిన 23 వేల రూపాయలను పంచాయతీ కార్మికులతో కలిసి సిఐటియు నడిగూడెం మండల కన్వీనర్ మల్లెల వెంకన్న మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా నరసింహారావు చిత్రపటానికి పూలమాలలేసి నివాళులు అర్పించారు.అనంతరం మాట్లాడుతూ నరసింహారావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. అదే విధంగా రత్నవరం గ్రామానికి చెందిన మరొక గ్రామ పంచాయతీ కార్మికుడు పాముల నాగరాజు తండ్రి పాముల వెంకన్న గత రెండు రోజుల క్రితం మరణించగా మృతుని చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కార్మికులంతా ఐక్యంగా ఉండాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు షేక్ సుభాని, కార్మికులు చిమట నాగరాజు, చాపల వెంకన్న, అల్లి వీరస్వామి, చిలకల కమలాకర్, రాజుల వెంకట్రామయ్య, మొలుగురి వెంకమ్మ, దున్న భువనేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.