జనం న్యూస్ 08 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం శుక్రవారం ఏర్పాటైంది. అధ్యక్షుడిగా లింగాల నరసింగరావు, ప్రధాన కార్యదర్శిగా వేదుల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా బట్టు డేవిడ్ రాజు, సంయుక్త కార్యదర్శి ఎం. రవికుమార్, కోశాధికారిగా ప్రత్తిపాటి శ్రీనివాసరావు తదితరులు ఎన్నికయ్యారు.
ఏపీయూడబ్ల్యూజేకు అనుబంధంగా ఈ సంక్షేమ సంఘం ఉంటుందని సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరసింగరావు తెలిపారు.


