Listen to this article

జనం న్యూస్ 10 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్

విజయనగరంలోని లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ రోడ్డు వద్ద బైక్‌ వేగంగా నడుపుతూ పాదచారుడిని ఢీకొట్టిన సంఘటన ఆదివారం కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పాదచారుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత బైక్‌ను నడిరోడ్డు మీద వదిలేసి బైక్‌ రైడర్లు అక్కడినుంచి పరారయ్యారు.
గాయపడిన వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.