జనం న్యూస్ నవంబర్ 10 మునగాల
సూర్యాపేట ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ సోమవారం మండల కేంద్రంలోని ఆకుపాముల లోని మాంటిస్సోరి పాఠశాల లో షీ టీమ్స్, సైబర్ నేరాలు,రోడ్డు ప్రమాదాల పైన,పోలీసు కళా బృందంతో విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్సై ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ నరసింహ అధ్వర్యంలో షీ టీమ్స్, డ్రగ్స్,సైబర్ నేరాలపై, రోడ్డు ప్రమాదాల నివారణ పై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు.ప్రతి స్కూల్, కాలేజీలలో చదువుకునే విద్యార్థులు,మానసిక స్థైర్యాన్ని సమస్యలను అధిగమించే ధైర్యాన్ని కలిగి ఉండాలని తెలియజేశారు. ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా, ఏటీఎం కార్డ్ వివరాలు,ఓటిపి వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే సూర్యాపేట షీ టీం ఫోన్ నెంబర్ 8712686056 కి సమాచారం ఇవ్వండి. విద్యార్థినిలు అందరూ క్రమశిక్షణ కలిగి, తల్లిదండ్రులను గురువులను గౌరవించి, ఉన్నత విద్యను అభ్యసించి మీ యొక్క లక్ష్యాలను చేరుకోవాలని తెలిపినారు. ఆకతాయిలు ఎవరైనా అల్లరి పెట్టినట్లయితే వేధించినట్లయితే షీ టీం కి సమాచారం ఇవ్వండి.మీయొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు.వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డిపి లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పించారు .
ఈ కార్యక్రమంలో మాంటిస్సోరి పాఠశాల ప్రిన్సిపల్ లీమా రోస్, డైరెక్టర్ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వీరన్న, కానిస్టేబుల్ మునీర్,కళాబృందం ఇంచార్జి యల్లయ్య,సభ్యులు గోపయ్య, చారి, సత్యం, కృష్ణ, నాగార్జున విద్యార్థిని, విద్యార్థులు మరియు బోధన సిబ్బంది పాల్గొన్నారు.



