Listen to this article

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు డిగ్రీ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రవికుమార్ ఒక ప్రకటన తెలియజేశారు. కళాశాలలో స్పాట్ అడ్మిషన్ ద్వారా అడ్మిషన్ పొందాలనుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా సరే తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు రెండు సెట్స్ జిరాక్స్ కాపీలతో ఈనెల 21వ తారీకు లోపు కళాశాలలో సంప్రదించి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. రిజిస్ట్రేషన్ కొరకు 500 రూపాయలు చెల్లించాలని తెలియజేశారు. కావున స్పాట్ అడ్మిషన్ ద్వారా కళాశాలలో చేరాలనుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు వెంటనే టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంప్రదించాలని తెలియజేశారు.