Listen to this article

నవంబర్ 20 జనం న్యూస్కామారెడ్డి జిల్లా

మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక నందు తహసిల్దార్ అధ్యక్షతన *సూక్ష్మ నీటిపారుదల గణన* మరియు *నీటి వనరుల గణన నమోదుపై గణనదారులకు శిక్షణ.”* కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీటి కుంటలు, చెరువులు, వివిధ సూక్ష్మ నీటి పారుదల వనరులను లెక్కించనున్నట్లు తెలిపారు. వీటిని మొబైల్ యాప్ ద్వారా నమోదు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా నీటి వనరుల లభ్యత గురించి తెలియనుందన్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీ ముజీబ్ గారు, ఏఎస్ఓ దత్తు, ఎన్యుమరెటర్స్ లు పాల్గొన్నారు.