విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్.
జనం న్యూస్ 21 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా రాజాం పోలీసు స్టేషను పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన నిందితుడికి మూడు రోజులు జైలుశిక్ష విధిస్తూ రాజాం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె.నైమిష నవంబరు 20న తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.వివరాల్లోకి వెళ్తే… రాజాం సిఐ కే.అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రాజాం పోలీసులు పట్టణంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి, మద్యం సేవించి, వాహనాలు నడిపిన తమిరి దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని, రాజాం పోలీసులు డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి, నవంబరు 20న రాజాం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కే.నైమిష వద్ద హాజరుపర్చగా, సాక్ష్యాలను పరిశీలించి, నిందితుడు డ్రంకన్ డ్రైవ్ చేసినట్లు గా నిర్ధారించి, మూడు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పును నవంబరు 20న వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. మెజిస్ట్రేట్ వారు ఇచ్చిన ఉత్తర్వులు మేరకు నిందితుడిని రాజాం సబ్ జైలుకు తరలించారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.మద్యం సేవించి వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నందున ఈ తరహా నేరాన్ని తీవ్రంగా పరిగణించి, నిందితులకు జైలుశిక్ష విధించే విధంగా చర్యలు చేవడుతున్నామన్నారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన శిక్షలు తప్పవని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హెచ్చరించారు.


