పాపన్నపేట. డిసెంబర్. 01 (జనంన్యూస్)
మండల కేంద్రం పాపన్నపేటలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాలు సోమవారం పలు చోట్ల తనిఖీలు నిర్వహించాయి.ప్రయాణ ప్రాంగణ ప్రాంతం, ప్రధాన చౌరస్తా, దుకాణాల్లో సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను గుర్తించేందుకు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.కానిస్టేబుళ్లు, తదితరులున్నారు.



