Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐ.పి.ఎస్.

జనం న్యూస్‌ 03 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ

పట్నాయక్‌విజయనగరం జిల్లా పోలీసుశాఖ వినియోగించి, కాలం చెల్లిన వస్తువులను ఈ నెల 9న వేలం వేయనున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గారు డిసెంబర్ 2న ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పోలీసుశాఖ వినియోగించి, కాలం చెల్లిన జనరేటర్లు, బ్యాటరీలు, ఎలక్ట్రికల్ వస్తువులు (ఫ్యాన్స్, టేబుల్ ఫ్యాన్స్ వగైరా), ఎలక్ట్రానిక్ వస్తువులు (రిఫ్రిజిరేటర్లు, వాటర్ డిస్పెంసర్లు, డీప్ ఫ్రీజర్లు, ఏసిలు వగైరా), ఫర్నిచర్ వస్తువులు, ఐరన్ స్క్రాప్ మరియు మిగతా వస్తువులు 8 లాట్లుగా విభజించామన్నారు. ఈ వస్తువులను బహిరంగ వేలం నిర్వహించనున్నామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.వేలం వేయనున్న వస్తువులను ప్రస్తుతం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో భద్రపర్చామని, ఆసక్తి కలిగిన వేలందార్లు డిసెంబరు 3 నుండి 8 వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గం.ల వరకు పరిశీలించుకోవచ్చున న్నారు. వివరాల కొరకు విజయనగరం ఎఆర్ అడ్మిన్ ఆర్ఐ ఎన్.గోపాల నాయుడు ఫోను నంబరు 9121109485 ను సంప్రదించవచ్చునని జిల్లా ఎస్పీ తెలిపారు. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన బిడ్డర్లు డిసెంబరు 9న ఉదయం 10గంటలకు జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణం వద్ద నిర్వహించే వేలంలో పాల్గొనాలన్నారు. ఆసక్తి కలిగిన బిడ్డర్లు అదే రోజున బిడ్ అమౌంట్ ను జి.ఎస్.టితో సహా ఆన్లైన్లో చెల్లించి, వస్తువులను 24గంటలలో తీసుకొని వెళ్లాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఒక ప్రకనటలో తెలిపారు.