Listen to this article

జనం న్యూస్, 3 డిసెంబర్, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా

.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం లోని, ఝరాసంగం మండల పరిధిలోని, 33 గ్రామ పంచాయతీలకు, సర్పంచ్, మరియు వార్డు సభ్యుల ఎన్నికలకు, రెండో విడత నామినేషన్లు, ఆదివారం ప్రారంభం కాగా, మంగళవారం సాయంత్రానికి ముగిశాయి. ఝరాసంగం మండలంలోని 33 గ్రామపంచాయతీలకు, సర్పంచ్ పదవి కొరకు 170 మంది, మరియు 288 మంది వార్డు సభ్యులకొరకు 618 మంది నామినేషన్లు సమర్పించినట్లు, ఝరాసంగం మండల అభివృద్ధి అధికారి, మంగళవారం రాత్రి, విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.