జనం న్యూస్ 04 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి రాజమహేంద్రవరం మోరంపూడి ఫ్లెఓవర్ కింద బుధవారం చనిపోయి ఉన్నాడు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి బొమ్మూరు పోలీసులు తరలించారు. సదరు వ్యక్తి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా మృతుడు విజయనగరం జిల్లా వాసిగా అక్కడి పోలీసులు గుర్తించారు.


