Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 8 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ మాతృమూర్తి రత్నమ్మ కు శ్రద్దాంజలి కార్యక్రమం మహిళా మోర్చా అధ్యక్షురాలు ఓరుగంటి నాగమణి అద్వర్యంలో అనకాపల్లి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి బొడ్డేడ నాగేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షురాలు బొగ్గారపు సౌందర్య అనకాపల్లి మండల అధ్యక్షులు నర్సింగ్ యాదవ్ కొమ్మనాపల్లి సన్యాసిరావు సిద్ధి లింగేశ్వర స్వామి టెంపుల్ డైరెక్టర్ అయ్యప్పగుప్త అటల్ జీ మండల కార్యదర్శి బల్లిన నర్సింగరావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.//