Listen to this article

ఆసిఫాబాద్‌లో కేక్ కట్ చేసిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

జనం న్యూస్ 8డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా. స్టాఫ్ఫర్.

ఆసిఫాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజక వర్గ ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్‌తో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.సుగుణక్క కేక్ కట్ చేసి నాయకులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధనలో సోనియా గాంధీ పాత్ర అపారమైనది. ఆమె దూరదృష్టితోనే తెలంగాణ రాష్ట్రం వెలుగులోకి వచ్చిందని అన్నారు. రాష్ట్ర అభ్యున్నతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండ శ్యామ్, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, మంగ,గడ్డల సత్తయ్య, విజయ్ ఉప్రే,కోవ ఇందిర, విజయ,మాజీ ఎంపిటిసి తిరుపతి స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.