ఉప సర్పంచ్ భగవాన్ సమీర్,
జనం న్యూస్,డిసెంబర్ 22,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామ సచివాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రావు,ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థి ఎలిశల సుగుణ మల్లారెడ్డి,ఉప సర్పంచ్ భగవాన్ సమీర్,వార్డ్ సభ్యులను అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సుగుణ మాట్లాడుతూ నన్ను ఎన్నుకున్న గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అమలు చేసే దిశగా కృషి చేస్తానని అన్నారు. ఎటువంటి భేద భావాలు చూపకుండా అందరితో మమేకమై గ్రామ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు.గ్రామంలో ఎటువంటి సమస్యలు నెలకొన్న తమ దృష్టికి తీసుకు వచ్చినట్లయితే ఆ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని అన్నారు.అనంతరం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వై మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి,మాజీ ఎంపీపీ పండరి నాథ్ రావ్ నాయక్,పెద్ద మల్లారెడ్డి,కోటగిరి మనోహర్,డాక్టర్ హమీద్,పార్టీ నాయకులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.


