Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 23 అమలాపురం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన గంధం పల్లంరాజు ఈ రోజు అమలాపురం ఎంపీ కార్యాలయంలో అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అలాగే రాబోయే కార్యక్రమాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ కార్యకర్తలను సమన్వయంతో ముందుకు నడిపిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు నిర్ణయించారు.అనంతరం పరస్పర అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కలిసి పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిక్కాల గణేష్ మోకా వెంకటసుబ్బారావు జనసేన సీనియర్ నాయకులు కొమ్ములు సురేష్ ఇది చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోనం సత్తిబాబు ఇందుగల ఆనంద్ వీరవెల్లిపాలెం బాబి తాటికాయలు సురేష్, తదితరులు పాల్గొన్నారు