Listen to this article

​జనం న్యూస్‌ 02 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విశాఖపట్నం రేంజ్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్న గోపినాథ్ జట్టి, ఐపీఎస్ గారు పదోన్నతిపై గురువారం ఇక్కడ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి) గా బాధ్యతలు స్వీకరించారు. రేంజ్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన పోలీసు అధికారులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.​ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీలు:ఐజీగా బాధ్యతలు చేపట్టిన గోపినాథ్ జట్టి గారిని రేంజ్ పరిధిలోని వివిధ జిల్లాల ఎస్పీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఐజీ గారికి పూల మొక్కలను అందజేసి నూతన సంవత్సర మరియు పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో
​తుహిన్ సిన్హా, ఐపీఎస్ (అనకాపల్లి జిల్లా ఎస్పీ),​అమిత్ బర్దర్, ఐపీఎస్ (అల్లూరి సీతారామరాజు జిల్లా),
​ కె.వి.మహేశ్వర్ రెడ్డి, ఐపీఎస్ (శ్రీకాకుళం జిల్లా),​ఎస్.వి.మాధవరెడ్డి, ఐపీఎస్ (మన్యం పార్వతిపురం జిల్లా),
​ ఎ.ఆర్.దామోదర్, ఐపీఎస్ (విజయనగరం జిల్లా) మరియు రేంజ్ పరిధిలోని డీఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.అనంతరం ఐజీ రేంజ్ పోలీసు కార్యాలయంలో కేక్ కట్ చేసి సిబ్బంది మధ్య నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది, క్యాంపు కార్యాలయ సిబ్బంది మరియు ఇతర శాఖల ప్రతినిధులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఐజీ సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేసి, నూతన సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.​బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఐజీ గోపినాథ్ జట్టి మాట్లాడుతూ.. రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు పెద్దపీట వేస్తామని, పోలీసు యంత్రాంగం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.