

ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా ప్రతి రైతుకు సకాలంలో అందించాలి….
రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్….
జనం న్యూస్ 5 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సూరారం గ్రామానికి చెందిన ఇటీవలే రోడ్డు ప్రమాదంలో బచ్చు రాజేశ్వరరావు మరణించిన విషయం తెలుసుకున్న రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ వారి కుటుంబాన్ని పరామర్శించి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భాస్కర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా వ్యవసాయ భూమి పట్టా పాస్ బుక్ (గుంట వున్నా) రైతు వయస్సు 60 స.రైతులకు రైతు బీమా 5 లక్షల రూపాయలు రైతు చనిపోయిన పెద్ద కర్మ చేసే లోపే డబ్బులు పడేటియి. మరణించిన 11 రోజుల లోపే గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఐదు లక్షల రైతు బీమా ఇచ్చేటటువంటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతు బీమా అందడం లేదని రైతు నాయకులు అన్నారు దీన్ని పూర్తిస్థాయిలో రైతు భీమ పథకం పరిశోధన చేసి లబ్దిదారుని కుటుంబానికి అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్నికల్లో 420 హామీలు ఇవ్వడమేనా ఇచ్చిన హామీల్లో రైతులకు భరోసా ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము అంటూ రైతన్నలకు కల్లబొళ్ళు మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 13 నెలలు దాటిన రైతులకు భరోసా ఇవ్వకపోవడం శోచనీయకం. ఈ కార్యక్రమంలో ఈ రవీందర్ రావు, తంగెడ ఉమాపతి రావు, బచ్చు రాజేశ్వరరావు, రవీందర్, విశాల సంగం డైరెక్టర్ బచ్చు వెంకట్రావు, యూత్ నాయకులు వినయ్ రావు, శ్రావణ్ రావు, సంపత్ రావు, దిలీప్ రావు, ప్రశాంత్ రావు , తదితరులు పాల్గొన్నారు