Listen to this article

జనం న్యూస్‌ 09 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

గాజులరేగ జిల్లా పరిషత్ హై స్కూల్లో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఏ. కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 18 ఏళ్ల లోపు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, ఇందుకు జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుందని హెచ్చరించారు. బాల్య వివాహాల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వివరించారు.