

జనం న్యూస్ జనవరి 10 చిట్యాల మండల ప్రతినిధి శ్రీనివాస్
జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల/ కళాశాల లో సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ మేకల రమేష్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మసాలా వెంకటేశ్వర్లు సమక్షంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ఈ సంబరాలలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపా ల్ ముగ్గుల పోటీలు ఆ ట ల పోటీలు వ్యాసరచన వకృత్వ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపాల్ మేకల రమేష్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అనేది మన హిందువుల ముఖ్య పండుగ అని ఈ పండుగకు అనేక రకమైనటువంటి తీపి వంటకాలు ముగ్గుల పోటీలు గొబ్బెమ్మలు ఇంటి ముందు గంగిరెద్దుల విన్యాసాలు బసవన్నల సంబరాలు పతంగుల విన్యాసాలు పిల్లల ఆటల పాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ యొక్క పండుగను పిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారని అన్నారు. అనంతరం పోటీలలో గెలిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నీలం రవీందర్ సమీరా, వాణి, అయోష, శివ, రాజు, జోష్ణ శ్రీలత ప్రసన్న శ్రీకాంత్ ఎండి కలీంపాషా రామస్వామి వేల్పుల భాస్కర్ రాజేంద్రప్రసాద్ మోర సాగర్ పుట్ట రాజు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు