Listen to this article

అమ్మవారికి అభిషేకాలు, నవగ్రహ హోమం, పల్లకి సేవ…

జనం న్యూస్ జనవరి 21 ప్రతినిధి ఎండీ జహంగీర్

శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ 15వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం నాడు దేవాలయంలో గోవు,వృషభ కళ్యాణం వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు దేవాలయ చైర్మన్ ఆకారపు విశ్వనాథం తెలిపారు.ఆలయ ప్రధాన అర్చకులు పి.నవీన్ కుమార్ వేద అర్చకులు,ప్రవీణా చార్యులు,గోపాలాచార్యులు నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన మిడిదొడ్డి పాండురంగయ్య,వరలక్ష్మి దంపతులచే గోవృషభ కళ్యాణాన్ని వేదమంత్ర చరణాల మధ్యనిర్వహించారు. సర్వ దేవత రూపం గోవు అని, గోవృషభ కళ్యాణం చేయడంతో పాడిపంటలు,భోగభాగ్యాలు, అష్టాఐశ్వర్యాలు,సర్వ కార్యసిద్ధి ప్రాప్తి లభిస్తుందని అన్నారు. కళ్యాణంలోపాల్గొన్న, చూచిన విశేష పుణ్య ఫలితం భక్తులకు దక్కుతుందని అన్నారు.తెల్లవారుజామున అమ్మవారికి విశేష ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.గణపతి పూజ,నవగ్రహ పూజలతో పాటు ప్రత్యేకంగా నవగ్రహ హోమాన్ని నిర్వహించారు. జన్మనిత్యా,గోచారరీత్యా గ్రహాలు శాంతించి విశేష ఫలితం పొందుటకు నవగ్రహ హోమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.జ్ఞానసరస్వతి పారాయణ కమిటీ సభ్యులచే లలితా సహస్ర పారాయణ పఠనం,మణిద్వీప వర్ణన, లింగాష్టకం భక్తులు సామూహికంగా పఠనం చేశారు.ఆలయ ఆవరణలో అమ్మవారికి పల్లకి సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాదం సామూహికంగా పంపిణీ చేశారు.శ్రీశైలం వెళ్తున్న శివదీక్ష స్వాములకు ప్రత్యేకంగా అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు.బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా 3వ రోజు బుధవారం నాడు గాయత్రి హోమం,వివిధ పాఠశాలల విద్యార్థులచే అమ్మవారికి సామూహిక అభిషేకాలు,చిన్నారులకు అక్షరాభ్యాసం,అన్నప్రాస కార్యక్రమాలు ఉన్నాయని అన్నారు.ఈకార్యక్రమంలో దేవాలయ ప్రధానకార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్య,కమిటీ సభ్యులు దొడ్ల ఇందుమతి, బాలస్వామి,మిడిదొడ్డి శివశంకర్,లగిశెట్టి వరలక్ష్మి,సోమశిల శారదమ్మ,రవికుమార్, భూపాల్ రెడ్డి,అలంపల్లి శివకుమార్,జటప్రోలు నవీన్ కుమార్,వివిధ ప్రాంతాల నుండి వచ్చినా భక్తులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.