Listen to this article

జనం న్యూస్‌ 24 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

కొత్తవలస-కిరండోల్ మార్గం దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి నుంచి తప్పిపోయే ప్రమాదం ఏర్పడింది. కేకే లైన్ ద్వారా ఐరన్ ఓర్, బొగ్గు వంటి కార్గో రవాణాతో జోన్కు భారీ ఆదాయం లభిస్తోంది. కొత్తవలస జంక్షన్తో పాటు శ్రీకాకుళం జిల్లాలో పలు సెక్షన్లు రాయగడ డివిజన్కు వెళ్లే పరిస్థితి తలెత్తుతోంది. రైల్వేలో ఉత్తరాంధ్రపై ఒడిశా ఆధిపత్యం కొనసాగుతుండగా.. ఈ మార్గం కోల్పోతే జోన్ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం పడుతుంది.