జనం న్యూస్ జనవరి 26 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )
బీబీపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో సోమవారం రోజున 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నక్షత్ర, అనే విద్యార్థిని ఇస్రో సందర్శనకు ఎంపికైననందుకు విద్యార్థిని నక్షత్ర,ను ప్రధానోపాధ్యాయులు సారయ్యల,ను రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అభినందించి జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్. సర్పంచ్ హరీష్ యాదవ్, తో కలిసి ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది. జిల్లా వైస్ చైర్మన్ నాగరాజ్ గౌడ్, మాట్లాడుతూ ఏ రంగంలో నైనా ప్రతిభ కలిగిన విద్యార్థులకు రెడ్ క్రాస్ సొసైటీ తరుపున ఎల్లప్పుడూ సహాకారం ఉంటుందని అయిన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల ఉత్పత్తి దారుల జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, ఉపసర్పంచ్ సంతోష్ రెడ్డి, వార్డ్ సభ్యులు నర్సింలు, రవి, ఉపాధ్యాయులు,గ్రామస్తులు పాల్గొన్నారు.


