జహీరాబాద్కు బుల్లెట్ రైలు పరిశీలనకు కేంద్ర మంత్రి ఆశ్వీనీ వైష్ణవ్ ఆదేశం*
జనం న్యూస్ మోహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ బ్యూరో ఇంచార్జ్: 31/07/2026జహీరాబాద్ మీదుగా బుల్లెట్ రైలును నడిపేందుకు ఏ మేరకు అనుకూలత ఉందనే విష యమై పరిశీలించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశించడం పట్ల ఎమ్మెల్సీ అంజిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గురువారం ఇందుకు సం బంధించిన వివరాలను వెల్లడించారు. ముంబై-హై దరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ను జహీరాబాద్ మీదుగా అలైన్మెంట్ చేయాలని ఈనెల 11వ తేదీనకేంద్ర రైల్వే మంత్రికి వినతిపత్రం అందజేశామ న్నారు. ఇందుకు సానుకూలంగా స్పందిస్తూ అధికా రికంగా ప్రత్యుత్తరం పంపినట్లు వెల్లడించారు. జహీరాబాద్ ప్రాంత పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి, ప్రయాణీకుల సౌలభ్యానికి బుల్లెట్ రైలు మార్గం జహీరాబాద్ మీదుగా వెళ్లడం అత్యంత కీలకమైంద న్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు జహీరాబాద్ మీదుగా సాకారమైతే ఈ ప్రాంతంలో రవాణా, లాజి స్టిక్ సౌకర్యాలు అద్భుతంగా మెరుగుపడడమే కాకుం డా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మరింత బలపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
