Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 11 సెల్ 9550978955

చిలకలూరిపేట పట్టణంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి అధికారులు చేపట్టిన చర్యలు “మూడు రోజుల ముచ్చట”గా మారుతున్నాయి. నర్సరావుపేట సెంటర్ నుండి రిజిస్టర్ ఆఫీస్ వరకు రోడ్డు విస్తరణ, ఆక్రమణల నివారణ కోసం ఏర్పాటు చేసిన బోర్డులు నేడు కేవలం అలంకారప్రాయంగా మిగిలాయి. అట్టహాసంగా మార్కింగ్.. ఆపై మౌనం కొద్ది రోజుల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారులు నర్సరావుపేట సెంటర్ నుంచి రిజిస్టర్ ఆఫీస్ వరకు రహదారికి ఇరువైపులా ఆక్రమణలు జరగకుండా స్పష్టమైన మార్కింగ్ ఇచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించేలా, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ చర్యల వల్ల మొదటి పది రోజులు రహదారి ఎంతో విశాలంగా, వాహనాల రాకపోకలకు అనువుగా కనిపించింది. అద్దె దందా: ఆక్రమణలే ఆదాయ మార్గం నిబంధనలు అమలులోకి వచ్చిన కొద్ది రోజులకే పరిస్థితి మళ్ళీ మొదటికి చేరింది. షాపుల యజమానులు తమ షాపుల ముందున్న ఖాళీ స్థలాన్ని, ప్రభుత్వం కేటాయించిన మార్కింగ్ లోపల ఉన్న భాగాన్ని చిరు వ్యాపారులకు అద్దెకు ఇస్తున్నారు. రోజుకు రూ. 100 నుండి రూ. 200 వరకు వసూలు చేస్తూ రోడ్డును ఆక్రమిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం – పార్కింగ్ కష్టాలు బోర్డుల కంటే ముందుకు వచ్చి దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల అసలు సమస్య మొదలవుతోంది. షాపులకు వచ్చే వినియోగదారులు తమ వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేయాల్సి వస్తోంది. టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం వేల రూపాయలు ఖర్చు చేసి బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు, వాటిని పర్యవేక్షించడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. “బోర్డులు పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదు, నిరంతరం నిఘా ఉంచి ఆక్రమణదారులపై జరిమానాలు విధిస్తేనే మార్పు వస్తుంది.” పట్టణంలోని ఈ దారుణ పరిస్థితులపై ఉన్నతాధికారులు స్పందించి, ఆక్రమణలను తొలగించి, సామాన్య ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుండి విముక్తి కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పట్టణ ప్రజల కోరుకుంటున్నారు.