Listen to this article

జనం న్యూస్ మార్చ్ 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం లో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఈనెల 17 18 తేదీలలో జరగబోవు అమ్మవారి జాతర చాటింపు కార్యక్రమం నూకాంబిక అమ్మవారి దేవస్థానం నుండి అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ భీమరిశెట్టి రామకృష్ణ (రామ్ కి) ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పీలా గోవిందు సత్యనారాయణ జాతర చాటింపు కార్యక్రమం ఘనంగాప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ సహా కమిషనర్ యాళ్ళశ్రీధర్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, బత్తుల తాతయ్య బాబు, మళ్ల సురేంద్ర, ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్, దాడి రవికుమార్ పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు,కాండ్రేగుల రాజారావు ,మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్,వడ్డాది మంగ,కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు,
యర్రవరపు సంతోషి కుమారినాగేష్, తదితరులు పాల్గొన్నారు.//