Listen to this article

జనం న్యూస్ మార్చ్ 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

రాష్ట్ర పండగ గుర్తింపు పొందిన అనకాపల్లి గవరపాలెం లో వెలిసిన శ్రీ నూకంబిక అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ముందుగా ఆయనను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయనను దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ సహా కమిషనర్ యాళ్ళశ్రీధర్‌ అమ్మవారి చిత్రపటం ప్రసాదం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో. అనకాపల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, పొన్నగంటి అప్పారావు,ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్,దాడి రవికుమార్
పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు,కాండ్రేగుల రాజారావు ,మజ్జి జానకి శ్రీనివాసరావు,
కొడుకుల శ్రీకాంత్,వడ్డాది మంగ,కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు,యర్రవరపు సంతోషి కుమారినాగేషి, తదితరులు పాల్గొన్నారు