Listen to this article

జనం న్యూస్ మార్చి 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం

నిజానికి. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు లను అత్యంత దారుణంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసి చంపిన రోజు.. భరతమాత బానిస సంకెళ్ళను తొలగించడానికి ఈ ముగ్గురు యువ మహావీరులు అమరులైన రోజు మార్చి 23 ఆ త్యాగదనులను స్మరిస్తూ.. వరంగల్ వెంకటరామ జంక్షన్ లోని భగత్ సింగ్ విగ్రహం వద్ద అశ్రునయనాలతో నివాళులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సామాజిక సంఘాల నాయకులు గడ్డం శరత్ , ధర్మపురి రామారావు , మండలం లోని ఆరేపల్లి గ్రామానికి చెందిన దామేరకొండ కొమురయ్య , మేడిగ సతీష్ , రౌతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..