Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 26 సెల్ 9550978955

గణపవరం గ్రామం నందు విస్తృత కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు

పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం నరసరావు పేట సబ్ డివిజన్ నాదెండ్ల పోలీస్ స్టేషన్ పరిధి లోని

గణపవరం గ్రామం నందు నరసరావు పేట సబ్ డివిజన్ ఇన్చార్జి DSP M. హనుమంతరావు నాదెండ్ల PS ఇన్చార్జి J.నిరంజన్ ట్రైనీ IPS చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్చార్జి ట్రైనీ DSP K.జయ కృష్ణ ఆధ్వర్యంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు,సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తూ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్డెన్ సెర్చ్ కార్యక్రమం నందు పోలీసు అధికారులను మరియు సిబ్బందిని బృందాలుగా విభజించి రౌడీ షీటర్లు,ట్రబుల్ మాంగర్స్,పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా… ఇళ్లు, పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీ లలో గణపవరం గ్రామం నందు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు – 51,కొడవళ్ళు – 12,గొడ్డళ్లు – 23,
గడ్డ పలుగు – 20 రోడ్లు – 13 స్వాధీనం చేసుకున్నారు.ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ అనంతవరం గ్రామం లోని ప్రజలతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.హెల్మెట్ వాడకం గురించి,గ్రామంలోని పరిస్థితుల గురించి సత్తెనపల్లి DSP M. హనుమంతరావు ప్రజలకు అవగాహన కల్పిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని,మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించి, మాదక ద్రవ్యాల వినియోగం వలన జరిగే అనర్థాల గురించి వివరించి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు DSP తెలిపారు.అంతేకాకుండా… రౌడీషీటర్లు,ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పాత కేసుల నిందితుల తో సమావేశమై పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.గ్రామంలో అకారణంగా గొడవలు సృష్టిస్తే సహించేది లేదని,గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్న పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని, గొడవలు సృష్టించే వారి మీద జిల్లా ఎస్పీ ఆదేశానుసారం కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.గణపవరం గ్రామం నందు జరిగిన కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో సత్తెనపల్లి DSP M. హనుమంతరావు తో పాటు నాదెండ్ల పిఎస్ ఇంచార్జ్ ట్రైనీ ఐపీఎస్ J.నిరంజన్ చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్చార్జి ట్రైనీ DSP K.జయ కృష్ణ CIలు, SI లు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.