Listen to this article

జనం న్యూస్, మార్చి 27,అచ్యుతాపురం:

అచ్యుతాపురం మండలం వ్యాప్తంగా రామాలయాల్లో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. మండలం లోని చోడపల్లి,పూడిమడక గ్రామంతో పాటు పలు గ్రామాల్లో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య,భక్తుల కోలాహలం నడుమ స్వామివారి కల్యాణం కనులపండుగగా సాగింది. ఈ పర్వదినాన చోడపల్లిలో కర్రి వెంకటరమణ, గెంజి రామకృష్ణ ఆర్ధిక సహాయంతో సుమారు 1500 మందికి భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. మండలం లోని పలు గ్రామాల్లో భారీ అన్నసమారాధన కార్యక్రమాలను నిర్వహించడంతో గ్రామస్తులు మరియు చుట్టు పక్క గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.