Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 2 భూపాలపల్లి జయశంకర్ జిల్లా

మహాముత్తార మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ స్వాములు హనుమాన్ ఉత్సవ యాత్ర చేపట్టారు గ్రామంలోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయం నుండి బయలుదేరి భక్తి పాటలతో భజన చేసుకుంటూ ఊరిలో ఉన్న గ్రామదేవతలు వనదేవతలకు మరియు పోచమ్మ లకు నీరు పోసి పూలమాలవేసి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హనుమాన్ గురుస్వామి మోత్కూర్ రవీందర్ పెంట చందు ఇసం పెళ్లి సంపత్ సముద్రాల రాజగోపాల్ మోతుకూరి శ్రీనివాస్ సముద్రాల రమేష్ మాచినేని శ్రీనివాస్ తిప్పని రజనీకాంత్ నాగరాజు రాజయ్య రాజు మరియు కన్యాసాములు రాము లక్ష్మణ్ పవన్ మధుకర్ బన్నీ స్వాములు తదితరులు యాత్రలో పాల్గొన్నారు