సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 05. 04. 2026
వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ పూలమాలలు వేసి ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకున్నారు. ఆయన దేశానికి అందించిన సేవలు మరువలేనివని, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అపారమని చిట్టెంపల్లి బాలరాజ్ పేర్కొన్నారు. అనంతరం ప్రజలకు ఆయన ఆశయాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.



