జనం న్యూస్ ఏప్రిల్ 8 2026 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంలా నిలిచిందని జగన్నాధపురం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కే శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 26 వేల రూపాయల విలువ గల చెక్కును లబ్ధిదారు పంజాల రాణి కి బుధవారం గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పెండ్యాల కుమార స్వామి, ఆరేపల్లి సమ్మయ్య, ఆరెపల్లి చిరంజీవి, మాజీ ఉప సర్పంచులు ఆరెపల్లి సమ్మయ్య, ఆరేపల్లి రమేష్, మాజీ వార్డు సభ్యులు పెండ్యాల భాస్కర్, పెండ్యాల సామేల్, బండి కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాల మధు, గూటం శ్రీనివాస్ రెడ్డి, జి ఎస్ రెడ్డి మాటూరి శ్రీనివాస్, శివరాత్రి మల్లయ్య, అరెపల్లి ఎల్లయ్య, కంసారపు సంపత్, పెండ్యాల పౌలు, ఆరెపల్లి కళ్యాణ్, ఎస్.డి హుస్సేన్, ఎస్. డి. కరీం, మేకల రాజు, హుస్నాబాద్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నాయకులు పంజాల అభిలాష్, పెండ్యాల రాజేష్ పంజాల అజయ్, కస్తూరి నవీన్, తదితరులు ఉన్నారు…



