Listen to this article

జుక్కల్ ఏప్రిల్ 10 జనం న్యూస్

యాసంగి వరి పంట సన్నం వడ్లు ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణలోకి రాకుండా ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర సరిహద్దు సలాబత్ పూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను శుక్రవారం మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ తనిఖీ చేశారు.రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్ శాఖల సిబ్బంది తో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ గారు తెలిపారు. ఈ తనిఖీ బృందం లో GPO నర్సింలు, AEO సరోజ, కానిస్టేబుల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు