Listen to this article

జనం న్యూస్ 13 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలను, సర్పంచులను, ఎంపీటీసీ, మండల అధ్యక్షులను కలుపుకొని పోవడంలో విఫలమయ్యాం.మా పాలనలో అందరు జర్నలిస్టులకు న్యాయం చేయలేకపోయాం.కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా లక్షలాది మంది గల్ఫ్‌లో ఉంటున్నా మేం గల్ఫ్ పాలసీ తీసుకురాలేకపోయాం.టీజీబీకేఎస్‌లో జరిగిన ఘటనలను బీఆర్ఎస్ అప్పుడే కొంత సీరియస్‌గా తీసుకుని ఉంటే మరిన్ని అసెంబ్లీ సీట్లు గెలిచేవాళ్ళం. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మా పార్టీ బలం పెరుగుతుంది.మే, జూన్ నెలలో పార్టీ సభ్యత్వం స్టార్ట్ చేస్తాం, కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి పార్టీ పటిష్టతకు కృషి చేస్తాం.డిలిమిటేషన్ వల్ల రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు పెరిగి బీఆర్ఎస్ చాలా మందికి అవకాశాలు వస్తాయి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్- కేటీఆర్