

మండుటెండలో అల్లూరి సీతారామరాజు గారు విగ్రహం ముందు మోకాళ్ళ పై నిరసన తెలుపుతూ లంటీర్లుతో కలిసి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్
జనం న్యూస్ 14 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటిర్లందరికి న్యాయం చేస్తామని చంద్రబాబు గారు చెప్పిన మాటలు నమ్మి రాష్ట్రంలో 1 లక్షా 65 వేల మంది రాజీనామాలు చేయకుండా ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్న వాలంటీర్లును కొనసాగిస్తున్నట్లు రాబోయే అసెంబ్లీ సమావేసాల్లో ప్రకటన చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు. గురువారం ఉదయం విజయనగరంలో ఎ.పి గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం ) అధర్యంలో దాసన్న పేట రైతు బజారు జంక్షన్ లో మండుటెండలో అల్లూరి సీతారామరాజు గారు విగ్రహం ముందు మోకాళ్ళ పై నిరసన తెలుపుతూ వాలంటీర్లు నిరసన తెలుపుతూ ముఖ్యమంత్రి గారూ వాలంటీర్లు కి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, మమ్మల్ని మోసం చేయకండి అని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా బుగత అశోక్ మీడియాలో మాట్లాడుతూ 2019 నుండి వాలంటీర్లుగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వాలంటీర్లుగా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను ప్రజల వద్దకు చేరవేయడంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిగా ఎంతో కష్టపడి పనులు చేసారని అన్నారు. కరోనా విళయతాండవం చేస్తున్న సమయంలో ప్రభుత్వం ఆదేశాలు మేరకు ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు. 2024 ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారములోనికి వస్తే మా వాలంటీర్స్ అందరికి న్యాయం చేస్తామని, నెలకు 10 వేల రూపాయలు గౌరవ వేతనం పెంచి ఇస్తామని, వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారనీ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత కూడా వాలంటీరు వ్యవస్థను కొనసాగిస్తామని ఇచ్చిన హామీలకు మేమంతా కట్టుబడి వున్నామని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయులు గారు మీడియా ద్వారా ప్రకటించారనీ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఎన్నికల సమయంలో గత ప్రభుత్వ రాజకీయ నాయకులు ఒత్తిడి చేసినా మేము రాజీనామాలు చేయలేదన్నారు. ఆన్లైన్లో ఇప్పటికి వాలంటీర్లు పేర్లు ఉన్నాయని అన్నారు. అందులో వాలంటీర్లు రిటైర్మెంట్ తేది కూడా ఉందని తెలిపారు. వీళ్ళు ఎవ్వరి రికమండిషన్లుతో ఉద్యోగాల్లో చేరలేదని విద్యార్హతలు బట్టి ఇంటర్వ్యూల్లో సెలక్ట్ అయ్యి ఉద్యోగాలు సాధించుకున్నామని తెలిపారు. దయచేసి వాలంటీర్లు పై రాజకీయాలు పులమొద్దు అని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వము అధికారం చేపట్టి 8 నెలలు పూర్తి కావస్తున్నది కానీ ఇంత వరకు వాలంటీర్లుకి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. 2024 జూన్ నెల నుండి మాకు గౌరవ వేతనం కూడా చెల్లించలేదన్నారు. రాష్ట్ర వ్యాపితముగా వివిధ ఉన్నత చదువులు చదువుకొని ప్రభుత్వానికి ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశ్యంతో వాలంటీర్ ఉద్యోగాల్లో చేరిన అందరి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తారని ఇచ్చిన మాట నిలబెట్టుకొని న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము అని తెలిపారు. వాలంటీర్లు సమస్యలను ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారు దృష్టికి తీసుకుని వెళ్ళి న్యాయం చేయమని కోరారు. 8 నెలలుగా ప్రభుత్వం నుండి గౌరవ వేతనం కూడా చెల్లించకపోతే ఎందరో మహిళలు ఆ గౌరవ వేతనం మీదే కుటుంబంలో కొంత ఆర్థక ఇబ్బందులను నెట్టుకొస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు వాలంటీర్స్ అందరికి న్యాయం చేస్తామని నెలకు పదివేల రూపాయలు గౌరవ వేతనం పెంచి ఇస్తామని వాలంటీర్లు అందరికి సమాజంలో మంచి గుర్తింపు గౌరవం వుండే పద్ధతిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని మరిచిపోవద్దు అని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని మరచిపోకుండా వాలంటీర్స్ అందరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, గౌరవ వేతనం పదివేల రూపాయలు ఇప్పించాలని, గత 8 నెలలుగా బకాయి ఉన్న గౌరవ వేతనాన్ని విడుదల చేయించాలని, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఉన్నత చదువులు చదువుకొని ప్రభుత్వానికి సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో వాలంటీర్ ఉద్యోగాల్లో చేరిన వాలంటీర్ అందరి భవిష్యత్తుకు భరోసా కల్పించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్లుకి న్యాయం జరగకపోతే ఏఐటీయూసీ వాలంటీర్లకు అండగా నిలబడి వాళ్ళకి న్యాయం జరిగే వరకూ దశల వారీ పోరాటాలకు కార్యాచరణతో వెళ్ళక తప్పదనీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయనగరంలో ఉన్న వాలంటీర్లు పాల్గొన్నారు.