

జనం న్యూస్ జనవరి 10 నడిగూడెం
మండలంలోని రత్నవరం గ్రామం లోని రామాలయ దేవాలయం లో
మిర్యాల ఆంజనేయులు ఆద్వర్యం లో శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధ్యాన సాధన పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ధ్యానరత్న పి.ఎస్. ఎస్ .ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన వల్ల తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు నయం చేసుకోవచ్చని రూపాయి ఖర్చు లేకుండా మన సాధనే పెట్టుబడిగా సుఖ ఆసనంలో హాయిగా కూర్చుని వేళ్లల్లో వేళ్ళు పెట్టుకుని రెండు కళ్ళు మూసుకొని మనం రోజు పీల్చుకునే సహజ సిద్ధమైన లోపలికి పీల్చే గాలిని బయటికి వదిలే గాలిని గమనించడమే ధ్యానం అన్నారు.ఇలా ప్రతిరోజు సమయ అనుకూలాన్ని బట్టి ధ్యాన సాధన చేస్తే వచ్చే రోగాలు రాకుండా ఉన్న రోగాలను పోగొట్టుకోవచ్చు అన్నారు. ఈ సాధన తో ఎంతోమంది అనారోగ్యాల నుండి బయటపడి ఆరోగ్యంగా జీవిస్తూ గొప్ప యోగులుగా మారారు అన్నారు. అనంతరం దేవాలయ పూజారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు వివిధ గ్రామాల పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ శైలజ ని ధ్యానులు ఘనంగా సన్మానించారు.