చేపల వేటకు వెళ్లి వలలో చిక్కుకొని మత్స్యకారుడు మృతి
జనం న్యూస్ ఆగస్టు 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి శివారులోని గల చలివాగు ప్రాజెక్టులో జరిగిన సంఘటన వివరాల ప్రకారం మండలంలోని మైలారం గ్రామానికి చెందిన పల్లె బోయిన బిక్షపతి ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో చలి వాగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు చేపలు పడుతూ ఉండగా చేపల కోసం వేసిన వలను తీసే క్రమంలో ప్రమాదవశాత్తు కాళ్లకు వల చుట్టుకొని నీటిలో పడిపోయి ఊపిరాడక మృతి చెందాడు తోటి మత్స్యకారులు మృతదేహాన్ని వెతికి తీశారు విషయం మృతుని భార్య పల్లె బోయిన సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు…..