మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ కు కన్నీటి వీడ్కోలు…

August 24, 2026 | తెలంగాణ

పాడే మోసిన మాజీ ఎమ్మెల్యే సిండే మాజీ జడ్పీ చైర్మన్ రాజు

జుక్కల్ ఆగస్టు 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలం BRS పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గైని విఠల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే , ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దాపేదర్ రాజు గైని విఠల్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా హన్మంత్ షిండే గారు మాట్లాడుతూ… గైని విఠల్ BRS పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడి పనిచేశారని, పార్టీ పట్ల అంకితభావంతో సేవలందించారని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పార్టీకి, కుటుంబ సభ్యులకు, అభిమానులకు తీరని లోటని పేర్కొంటూ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.గైని విఠల్ అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసి, ఆయనతో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని హన్మంత్ షిండే ప్రార్థించారు.

🌐 Select Language:
📰 ePaper