

జనంన్యూస్. 19. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. సిరికొండ.సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు కారల్ మార్క్స్. ఫిబ్రవరి 20 న చలో హైద్రాబాద్ ను జయప్రదం చేయాలని గడుకోల్ లో పోస్టర్ల ఆవిష్కరణ. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిరికొండ మండలం గడుకోలు గ్రామంలో పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు 14 నెలలు పూర్తవుతున్న అమలు కాలేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎన్నికలలో ఇచ్చిన హామీలు, ప్రకటించిన పథకాలన్నీ అమలు చేస్తామని నేటికీ అమలు చేయలేక పోయారని విమర్శించారు. వళ్ళకాని మోసపురిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ నేడు అమలు చేయలేక కాలయాపన చేస్తుందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో పాలకులకు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పేదోడిని కొట్టి ఉన్నోనికి పెట్టు అనే చందంగా ప్రభుత్వం వ్యవహారిస్తుందని,గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ విదానాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవలంబిస్తుందని విమర్శించారు. తక్షణమే ప్రజలకు ఇస్తామన్న గ్యారెంటీలను, హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.దేశంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ప్రజలపట్ల ఒకే వైఖరి కలిగి ఉన్నాయని, ప్రజలు చైతన్యమై పాలకులకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. హామీలు, వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రదర్శన,సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో. ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు నిమ్మల భూమేష్ కార్యదర్శి .ఎల్లయ్య గ్రామ శాఖ అధ్యక్షులు గులాం హుస్సేన్, చిన్న గంగారం నరసయ్య, జాకీర్, నరసగౌడ్, సాయిలు, రాజా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.