

త్రాగునీటి సరఫరా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి..
ఎన్నికల కోడ్ ముగిశాక రేషన్ కార్డ్ ల పంపిణీ..
ఎరువుల కొరత లేకుండా చూడాలి..
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి..
జనం న్యూస్19 (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురి మెల్ల శంకర్ ) టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అంతరాయం లేకుండా విద్యుత్ నిరంతరంగా సరఫరా అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని విద్యుత్, త్రాగునీరు, సాగునీరు, రేషన్ కార్డ్ దరఖాస్తుల పరిశీలన మరియు రైతు భరోసా దరఖాస్తుల నమోదు ప్రక్రియ ల పై అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి,, సంబంధిత జిల్లా అధికారులు, తాసిల్దారులు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, ఎం ఏ ఓ లు, ఎంసీఎస్లు, డిఇలు మరియు మిషన్ భగీరథ మరియు విద్యుత్ శాఖ ఏఈలతో టెలికాన్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ.. ప్రజల గృహ మరియు వాణిజ్య అవసరాలకు అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆటో జనరేటర్లు అందుబాటులో కు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతు భరోసా దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా పార్షియల్ సబ్ డివిజన్ మార్కింగ్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చినందున తాసిల్దారులు మరియు మండల వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని వ్యవసాయానికి యోగ్యం కానీ భూముల మార్కింగ్ ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో యూరియా ఎంత అందుబాటులో ఉంది ఎంత అవసరం పడుతుందో తగిన నివేదికల సమర్పించాలని, రైతులకు తగినంత ఎరువులు అందుబాటులో డేల చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని సాగు అవసరాలకు నీరు అందేలా ఇరిగేషన్, మండల వ్యవసాయ అధికారులు మరియు తాసిల్దార్లు సమన్వయంతో పర్యవేక్షించి చివరి రైతులకు కూడా సాగునీరు అందేలా చూడాలి అన్నారు. జిల్లాలో రైతు భరోసా ఫిర్యాదులపై సమగ్ర నివేదికలు మండల మరియు జిల్లాస్థాయిలో అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో త్రాగునీటి అవసరాలకు సరిపడా నీరు ఉందని కలెక్టర్ అన్నారు. త్రాగునీటి సరఫరా లో వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారా వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్లు మరియు పంచాయతీ సెక్రటరీలు ఏ వార్డులో ఏ పంచాయితీలో త్రాగునీటి సరఫరాకు సమస్యలు ఉన్నాయో గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. త్రాగునీటి ట్యాంకులను ప్రతినెల రెండు సార్లు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లాలని ఆదేశించారు. ఎంపీడీవోలు ఎంపీలు తమ పరిధిలోని పాత మోటర్లు బాగు చేసి వాటిని అదనంగా అందుబాటులో ఉంచుకోవాలని, ప్రతి గ్రామంలో 10 శాతం మోటర్లు ఘనంగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చేతిపంపులు ఎక్కడైతే రిపేరు ఉన్నాయో గుర్తించి వాటిని రిపేర్లను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున కొత్త రేషన్ కార్డ్ ల పంపిణీ ఎన్నికల అనంతరం చేపడతామని కలెక్టర్ అన్నారు. మీ సేవలో కొత్త రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలన పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో సోలార్ పవర్ ప్లాంట్ ల స్థాపన కొరకు స్థల గుర్తింపును త్వరితగతిన పూర్తి చేయాలని కొత్తగూడెం మరియు భద్రాచలం ఆర్డీవో లను ఆదేశించారు.