

బిచ్కుంద ఫిబ్రవరి 23 జనం న్యూస్ ( జుక్కల్ కాని స్టేషన్ రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా జోరుగా కొనసాగుతున్న ప్రచారం. బిచ్కుంద మండలం లో మిషన్ కల్లాలి గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారిని మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టబద్రుల ఓటర్లను కోరడం జరిగింది. పట్టభద్రులతో ఎలక్షన్ గురించి మరియు అభివృద్ధి చెందుతున్న పథకాల దృష్ట్యా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుల్కల్ మాజీ సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి, గుండెకల్లు రాజు పటేల్ ,పి సి సీ డెలిగేటు విట్టల్ రెడ్డి కాగ్రెస్ మండల అధ్యక్షులు దర్పల్ గంగాధర్ బిచ్కుంద మండల్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు అనిల్ పటేల్, ఉత్తం పటేల్ హనుమంతరావు , శంకర్ పటేల్ ,బాబు పటేల్, రవి పటేల్ మాజీ జెడ్పిటిసి నాగనాథ్ , కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
