Listen to this article

జనం న్యూస్, ఫిబ్రవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ (ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ – (ఎం ఆర్ పి స్ ) మరియు అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణలో జరిగిన లోపాలు , చేయాల్సిన సవరణల మీద చర్చించేందుకు ( .ఆర్.పి.ఎస్ ) అన్ని అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్ లోని డ్రీమ్ ల్యాండ్ గార్డెన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా వెంకటేష్ నేత, డా. పృథ్వి రాజ్ యాదవ్, సయ్యద్ ఇస్మాయిల్, హోలియ దాసరి వెంకటేష్ , జానకి రామయ్య చౌదరి, వేల్పుల సూరన్న పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణలో అందరికి న్యాయం జరిగేలా , మాదిగలకు రావాల్సిన తగిన వాటా సాధించుకునేల భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించడం మీద ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చ జరుగుతుంది.
ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అద్యక్షులు గోవిందు నరేష్ మాదిగ అధ్యక్షత వహిస్తున్నారు
ఈ కార్యక్రమాన్ని ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బొర్రా బిక్షపతి మాదిగ సమన్వయం చేశారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు టీవీ నరసింహ మాదిగ స్వాగత ఉపన్యాసం చేశారు.
హైదరాబాద్ జిల్లా నేతలు ఇటుక శ్రీ కిషన్ , డప్పు మల్లిఖార్జున్ , రవి, అరుణ్, ఇంకా మరికొంత సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సమావేశ నిర్వహణలో పాలుపంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.