

జనం న్యూస్ 28 ఫిబ్రవరి పూడూరు మండల ప్రతినిధి వికారాబాద్ జిల్లా పూడూర్ మండల్ కంకల్ గ్రామంలో వీరభద్రేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారి రథోత్సవం గ్రామంలోని వీధుల గుండా ఊరేగించారు. కార్యక్రమంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారిని వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, పెంటయ్య, శ్రీనివాస్, రఘునాథ్ రెడ్డి, వికారాబాద్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు పూడూర్ మండల సొసైటీ చైర్మన్ పి సతీష్ రెడ్డి, గ్రామ యువజన నాయకులు, వివిధ గ్రామాల యువజన నాయకులు పాల్గొనడం జరిగింది.