Listen to this article

హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ జనం న్యూస్ మార్చి 1( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట్ మండలంలోని యాడారం గ్రామంలో శుక్రవారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ జనరల్ మేనేజర్ అశోక్, మాట్లాడుతూ రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఆయిల్ పామ్, మధ్యలో అంతర పంటలు సాగు చేస్తే లాభాలు ఎలా ఉంటాయి. అని రైతులకు వివరించి చెప్పడం జరిగింది. ఆయిల్ ఫామ్ సాగు చెయ్యడానికి రైతులు ముందుకు రావాలని అన్నారు. కామారెడ్డి జిల్లాకు హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ వారు కంపెనీని బిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు అని అన్నారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ అశోక్, వ్యవసాయ విస్తరణ అధికారి సంతోష్ కుమార్, కంపెనీ ప్రతినిధి సత్యనారాయణ సర్పంచ్ వెంకట్రావు, రైతులు ధర్మారెడ్డి, సత్యనారాయణ రావు, మహేందర్ వర్మ, అశోక్ రావు, పిడుగు స్వామి, మరియు రైతులు పాల్గొన్నారు. తర్వాత ఆయిల్ ఫామ్ తోట సందర్శించడం జరిగింది.